Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా.. 2.5 లక్షల మంది మృతి.. ఆక్సిజన్ థెరపీ వర్కౌటైంది..

కరోనా.. 2.5 లక్షల మంది మృతి.. ఆక్సిజన్ థెరపీ వర్కౌటైంది..
, శనివారం, 9 మే 2020 (14:40 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే నలభై లక్షల మందికిపైగా ఈ వైరస్ సోకింది. వీరిలో దాదాపు పన్నెండు లక్షల మందికిపైగా కోలుకోగా.. మరో రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో.. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో వైద్యులు అనేక రకాలుగా చికిత్స అందిస్తూ.. కరోనా బాధితుల ప్రాణాలను రక్షిస్తున్నారు. 
 
తాజాగా.. భోపాల్ వైద్యులు ఆక్సిజన్ థెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించి.. 396 మందిని రక్షించారు. కరోనా బారినపడ్డ బాధితులకు ఆక్సిజన్ థెరపీ అందించడం ద్వారా.. భోపాల్ చిరాయు ఆస్పత్రి డాక్టర్లు ఇప్పటి వరకు 396 మందికి ఆక్సిజన్ థెరపీ ద్వారా విజయవంతంగా చికిత్స అందించారు.
 
ఇదిలావుంటే కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారినందరినీ.. మరో పద్నాలుగు రోజులపాటు ఇంట్లోనే ఉండాలని సూచించామన్నారు. క్వారంటైన్ పూర్తయిన తర్వాత.. వీరంతా తమ ప్లాస్మాను దానం చేయాలని కోరారు. కరోనా వచ్చిన వారికి త్వరగా ఆక్సిజన్ థెరపీ అందించడం ద్వారా కరోనాకు విజయవంతంగా చికిత్స అందించవచ్చని తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై ఎల్‌జీ పాలిమర్స్‌ క్షమాపణ, నారా లోకేష్ ట్వీట్