Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క చలానా పెండింగ్‌... బండి సీజ్.. ఎక్కడంటే?

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (12:44 IST)
హైదరాబాద్ జీహెచ్ఎంసి పరిధిలోనే గత ఆరునెలల్లో ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇక జరిమానా, చలనాలతో ఖజానాలో కాసుల వర్షం కురుస్తుంది. ఇక గత నెల రోజుల నుంచి హైదరాబాద్ పోలీసులు పెండింగ్‌‌ ట్రాఫిక్ ఫైన్లు వసూలు చేసేందుకు స్పెషల్‌‌ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. లాక్‌‌డౌన్ కేసులతో పాటు ట్రాఫిక్ రూల్స్‌‌ బ్రేక్ చేసిన వాహనదారుల నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. 
 
తాజాగా ఒక్క చలానా పెండింగ్‌ ఉందని మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఓ ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేశారు. కూకట్‌పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్‌ తొగరి బైకును ఆదివారం పర్వత్‌నగర్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. 
 
ఆ బైకుపై రూ.1650 చలానా పెండింగ్‌ ఉందని, చెల్లించాలని ఎస్‌ఐ మహేంద్రనాథ్‌ కోరారు. అది తప్పుడు చలానా అని న్యాయవాది బదులిచ్చారు. బండిని సీజ్‌ చేయగా, ఒక్క చలానాకే ఎలా చేస్తారని ఆయన నిలదీశారు. మాదాపూర్‌ ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఒక్క చలానా పెండింగ్‌ ఉన్నా సీజ్‌ చేయొచ్చని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments