Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (13:00 IST)
తెలంగాణాలోని ట్రిపుల్ ఐటీ బాసరలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వెళ్లిన మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌ను విద్యార్థి సంఘానే నేతలు అడ్డుకున్నారు. 
 
నిజానికి ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల ప్రతినిధులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఆయన అధికారిక ప్రకటన చేస్తూ చర్చలు సఫలం అంటూ పేర్కొన్నారు. కానీ, విద్యార్థి సంఘాల నేతలు మాత్రం చర్చలు విఫలం అంటూ ట్వీట్ చేశారు. దీంతో విద్యార్థుల ఆందోళన ముగియలేదు కదా మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నారు. 
 
పైగా, తాము చేస్తున్న 12 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్‌పై కూడా మంత్రులు స్పష్టత ఇవ్వలేదని విద్యార్థులు ప్రకటించారు. హామీ పత్రం విడుదల చేసిన మరుక్షణమే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు ప్రకటించారు. మరోవైపు, తెలంగాణ మంత్రులకు వరుసగా సెగలు తగులుతున్నాయి. 
 
నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. ఈయన కాన్వాయ్‌ను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీపై స్పందించాలని ఆయన్ను విద్యార్థులు డిమాండ్ చేశారు. మరోవైపు, మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments