Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హింసాకాండ సూత్రధారి అరెస్టు

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (12:50 IST)
సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నివీరులు (అగ్నిపథ్)కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాకాండ చోటుచేసుకుంది. ఈ హింసాకాండకు సూత్రధారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు.. ఇపుడు ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు. 
 
ఏపీలోని నర్సారావు పేటలో సాయి డిఫెన్స్ అకాడెమీని నడుపుతున్న ఆవుల సుబ్బారావును ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన మాజీ సైనికోద్యోగి కావడం గమనార్హం. పైగా, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన హింసాకాండకు పథక రచన చేసింది ఏపీలోనని తేలిపోయింది. 
 
మరోవైపు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఏడుగురు అనుమానితులను రైల్వే పొలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మరికొంత మంది అభ్యర్థులను గుర్తించే పనిలో పోలీసులున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments