Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకను వేధిస్తున్న ఇంధన కొరత - ఆఫీసులు - స్కూల్స్ మూసివే

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (12:40 IST)
పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకను ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీంతో ఆ దేశ పాలకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలను మూసివేస్తూ ఆదేశాలు జారీచేశారు. అయితే, ఈ మూసివేత నుంచి వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలకు మాత్రం మినహాయింపునిచ్చింది. అలాగే, కొలంబో సిటీ పరిధిలోని స్కూల్స్‌లు మాత్రం ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించేలా ఆదేశించింది. ఒకవైపు ఇంధన కొరత, మరోవైపు, గంటల కొద్దీ కరెంట్ కోతలు అమలవుతున్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది. 
 
కాగా, శ్రీలంకలో గత నెల రోజులుగా రోజుకు 13 నుంచి 15 గంటల పాటు కరెంట కోతను అమలు చేస్తున్నారు. అలాగే, ఇంధన కొరత కూడా తీవ్రంగా వేధిస్తుంది. పెట్రోల్ బంకుల వద్ద గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కొరతతో అనేక మంది ఉపాధిని కూడా కోల్పోయారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా శ్రీలంక ప్రభుత్వం ఎన్నడూ లేనివిధంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. రెండు కోట్లకుపైగా జనాభా కలిగిన శ్రీలంకలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఉత్పన్నమైంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయింది. ఔషధాల కొరత ఏర్పడింది. దీంతో శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

హైదరాబాద్‌ లో అల్లు అర్జున్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పర్యవేక్షణలో అట్లీ

Ruchi Gujjar video రుచి గుజ్జర్ ఎద ఎత్తులపై ప్రధాని మోడి ఫోటోల దండ

Ratnam: వినోదంతో పాటు, సందేశం ఇవ్వాలనేది నా తపన : ఎ.ఎం. రత్నం

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments