Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బండి సంజయ్

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (15:27 IST)
తెలంగాణ పోలీసులు తనపై మోపిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ నెల 2వ తేదీన కరీనంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన జాగరణ దీక్షను చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా ఆయన ఈ దీక్షకు దిగారు. 
 
అయితే, బండి సంజయ్ కోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరుచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న బండి సంజయ్‌ను హుజురాబాద్ శాసన సభ్యుడు, బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments