Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో బీజేపీతో పొత్తు కేవలం ఉహాగానాలే : బండి సంజయ్

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (17:22 IST)
ఈ యేడాది ఆఖరులో తెలంగాణ అసెంబ్లీకి, వచ్చే యేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం సాగుతోంది. వీటికి మరింత ఊతమిచ్చేలా బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాలతో టీడీపీ చీఫ్ చంద్రబాబు భేటీ అయ్యారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైందని అనేక మంది వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ఈ ప్రచారంపై బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాతో భాజపా పొత్తు ఉంటుందనేది ఊహాగానాలే అని అన్నారు. ఊహాజనిత కథనాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తెదేపా అధినేత చంద్రబాబు కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. 
 
గతంలో మమత, స్టాలిన్‌, నీతీశ్‌ కూడా మోడీ, అమిత్‌షాను కలిశారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతలు, ప్రజలను కలవకుండా ఉండే పార్టీ భాజపా కాదని చెప్పారు. కేసీఆర్‌ మాదిరిగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ భాజపా కాదని సంజయ్‌ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments