Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు భూమిపై వున్నారా లేక ఆకాశంలోనా? తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు అసహనం

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (15:00 IST)
ఒకవైపు కరోనావైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టు... ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలు విలువైనవా అంటూ నిలదీసింది.
 
అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా వుందో చూశారా, అసలు మీరు భూమి మీద వున్నారా లేక ఆకాశంలోనా అని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికలు నిర్వహించేందుకు కొన్ని మునిసిపాలిటీలకు ఇంకా సమయం వుండగానే ఈ మహమ్మారి సమయంలో ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది.
 
రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం తాము ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎస్ఇసి అధికారులు చెప్పగా, మరి కరోనా రెండో దశ మొదలైన విషయం తెలిసి కూడా నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారంటూ కోర్టు ప్రశ్నించింది. కరోనా కట్టడి సమయంలో ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు, విచారణకు అధికారులు హాజరు కావాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments