Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏపీ హైకోర్టు మహిళా జడ్జి

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (11:37 IST)
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు మహిళా న్యాయమూర్తి వి.సుజాత తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా చివ్వెల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వర్షంలో న్యాయమూర్తి కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో న్యాయమూర్తి తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్‌లో హైదరాబాద్ నగరానికి తరలించారు. 
 
న్యాయమూర్తి ప్రయాణిస్తున్న కారు చివ్వెల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలియగానే తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ఆమెను మెరుగైన చికిత్స కోసం తన కాన్వాయ్‌లో హైదరాబాద్ నగరానికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమై జాతీయ రహదారి పొడవునా కాన్వాయ్‌కు అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments