బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వర్షాలు ఇప్పట్లో తగ్గబోవు- వాతావరణశాఖ

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (12:33 IST)
తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన ఆదివారం నాడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నదని, ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తోడు, కొత్త అల్పపీడనం కారణంగా ఏర్పడే పరిస్థితులు కలిసి, మరిన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది.
 
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినా, ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాదులో నిత్యమూ ఏదో ఒక సమయంలో భారీ వర్షం కాసేపు పలకరిస్తూనే ఉంది.
 
ఇక రాగల 48 గంటల్లో ఉమ్మడి అదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా ఒకటి రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణశాఖ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments