Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో విషాదం : పడవ మునిగి 13 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (12:22 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో గురువారం జరిగిన విషాద ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 13కు చేరింది. చంబల్ నదిలో పడవ మునిగిపోవడంతో ఈ విషాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగి మరో రెండు మృతదేహాలను వెలికితీశాయి. మృతులను జ్యోతి (13), గ్లోమా (15)గా గుర్తించారు. ఘటనా స్థలానికి కిలోమీటరున్నర దూరంలో వీరి మృతదేహాలను గుర్తించినట్లు సహాయ బృందాలు తెలిపాయి.
 
ఖటోలీ ప్రాంతం నుంచి 35 మంది భక్తులు, 18 బైకులతో బుంది జిల్లాలోని కాళేశ్వర్‌ స్వామి ఆలయానికి వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి 22 మంది సురక్షితంగా బయటపడగా 13 మంది గల్లంతయ్యారు. వీరిలో 11 మంది మృతదేహాలను ఇప్పటికే వెలికితీయగా శుక్రవారం మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. 
 
పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించి ప్రమాదానికి కారణమైన మహేంద్ర మీన, హేమ్‌రాజ్‌, మోదులాల్‌, వినోద్‌తోపాటు మరొకరిపై 304 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్‌ పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments