Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో విషాదం : పడవ మునిగి 13 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (12:22 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో గురువారం జరిగిన విషాద ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 13కు చేరింది. చంబల్ నదిలో పడవ మునిగిపోవడంతో ఈ విషాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగి మరో రెండు మృతదేహాలను వెలికితీశాయి. మృతులను జ్యోతి (13), గ్లోమా (15)గా గుర్తించారు. ఘటనా స్థలానికి కిలోమీటరున్నర దూరంలో వీరి మృతదేహాలను గుర్తించినట్లు సహాయ బృందాలు తెలిపాయి.
 
ఖటోలీ ప్రాంతం నుంచి 35 మంది భక్తులు, 18 బైకులతో బుంది జిల్లాలోని కాళేశ్వర్‌ స్వామి ఆలయానికి వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి 22 మంది సురక్షితంగా బయటపడగా 13 మంది గల్లంతయ్యారు. వీరిలో 11 మంది మృతదేహాలను ఇప్పటికే వెలికితీయగా శుక్రవారం మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. 
 
పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించి ప్రమాదానికి కారణమైన మహేంద్ర మీన, హేమ్‌రాజ్‌, మోదులాల్‌, వినోద్‌తోపాటు మరొకరిపై 304 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్‌ పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments