Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా ఒకవైపు.. భారీ వర్షాలు మరోవైపు.. పాకిస్థాన్‌లో 310మంది మృతి

కరోనా ఒకవైపు.. భారీ వర్షాలు మరోవైపు.. పాకిస్థాన్‌లో 310మంది మృతి
, ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (16:22 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు తోడు భారీ వర్షాలు ప్రాణ, ఆస్తినష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇంకా భారీ వర్షాలు కూడా ప్రజలను నానా తంటాలకు గురి చేస్తోంది. తాజాగా భారీ వర్షాల ధాటికి పాకిస్థాన్‌లో పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. చాలామంది నివాసాలు కోల్పోయారు. లోతట్టు ప్రాంతాలు నదులను తలపించేలా కురిసిన వర్షాలతో దారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 
 
గడిచిన రెండున్నర నెలల్లో కురుస్తున్న వర్షాలకు దేశవ్యాప్తంగా 310మంది మృతి చెందగా 230 మంది గాయపడ్డారు. రుతుపనాలు ప్రారంభమైనప్పటి నుంచి నుంచి ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో 116 మంది, సింధ్‌ ప్రావిన్స్‌లో 136 మంది, బలూచిస్తాన్‌లో 21 మంది, పంజాబ్‌లో 16 మంది, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో 11 మంది, పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే)లో 12 మంది మృతి చెందారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మరణించిన వారిలో 142 మంది పురుషులు, ఆరుగులు మహిళలు, 41మంది చిన్నారులు వున్నారు. 78,521 మంది నిరాశ్రయులైనారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ కేర్ సెంటర్... వేడినీళ్లు ఇచ్చాడు.. మహిళపై అత్యాచారం.. పాపను చంపేస్తానని..?