Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ హింసాకాండ సూత్రధారి అలహాబాద్ పృథ్వీరాజ్

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (15:00 IST)
సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ హింసాకాండ జరిగింది. ఈ హింసాకాండకు సంబంధించిన వీడియోలు వెలుగు చూశాయి. ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారి అలహాబాద్‌కు చెందిన పృథ్వీరాజ్ అని, అతనే హింసకు పాల్పడేలా ఇతర యువకులను ప్రోత్సహించినట్టు తేలింది. 
 
దీంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ముందుగా ప్యాసింజర్ బోగీలోకి వెళ్ళి సీట్లకు నిప్పుపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఫ్లాట్‌ఫాంపై ఉన్న రైల్వే ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. వాట్సాప్ చాటింగ్, పోస్టుల ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
రైలు ప్యాసింజర్ బోగీలో సీట్లకు నిప్పుపెడుతూ సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశాడు. ఆ విజువల్స్‌ను వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసి యువకులను రెచ్చగొట్టినట్టు పోలీసులు తేల్చారు. శాంతియుతంగా ఆందోళన చేయడానికి వచ్చిన అభ్యర్థులను పృథ్విరాజే విధ్వంసానికి పాల్పడేలా ప్రేరేపించినట్టు నిర్ధారించారు. రైల్వే ఆస్తులను, బోగీలను కూడా నాశనం చేశాడు. దీంతో పృథ్వీరాజ్‌తో పాటు మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments