Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ హింసాకాండ సూత్రధారి అలహాబాద్ పృథ్వీరాజ్

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (15:00 IST)
సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ హింసాకాండ జరిగింది. ఈ హింసాకాండకు సంబంధించిన వీడియోలు వెలుగు చూశాయి. ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారి అలహాబాద్‌కు చెందిన పృథ్వీరాజ్ అని, అతనే హింసకు పాల్పడేలా ఇతర యువకులను ప్రోత్సహించినట్టు తేలింది. 
 
దీంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ముందుగా ప్యాసింజర్ బోగీలోకి వెళ్ళి సీట్లకు నిప్పుపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఫ్లాట్‌ఫాంపై ఉన్న రైల్వే ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. వాట్సాప్ చాటింగ్, పోస్టుల ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
రైలు ప్యాసింజర్ బోగీలో సీట్లకు నిప్పుపెడుతూ సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశాడు. ఆ విజువల్స్‌ను వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసి యువకులను రెచ్చగొట్టినట్టు పోలీసులు తేల్చారు. శాంతియుతంగా ఆందోళన చేయడానికి వచ్చిన అభ్యర్థులను పృథ్విరాజే విధ్వంసానికి పాల్పడేలా ప్రేరేపించినట్టు నిర్ధారించారు. రైల్వే ఆస్తులను, బోగీలను కూడా నాశనం చేశాడు. దీంతో పృథ్వీరాజ్‌తో పాటు మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments