Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్‌ మంటలు - సికింద్రాబాద్ మీదుగా వెళ్లే అన్ని రైళ్ళూ రద్దు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (13:32 IST)
దేశంలో సైనిక నియామకాలకు కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరుద్యోగులు దేశ వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఈ అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంలోనే ఆర్మీ ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇవి ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. ఇపుడు దక్షిణాదికి వ్యాపించాయి.
 
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు శుక్రవారం నిరసనలకు దిగారు. ఇవి అదుపుతప్పాయి. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు ఈస్ట్ కోస్ట్ రైలుకి నిప్పు పెట్టారు. అలాగే, స్టేషన్‌లోని 20 బైకులకు నిప్పుపెట్టారు. 
 
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులు.. మూడు రైళ్లు, 20 బైక్‌లకు నిప్పుపెట్టి రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేయడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది. మీడియా కథనాల మేరకు... పోలీసు కాల్పుల్లో ఒకరు మరణించారు.  దీంతో రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి అదుపు తప్పింది.
 
దక్షిణ మధ్య రైల్వే అధికారులు 44 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు అన్ని రైళ్లను రద్దు చేశారు. 300 రైళ్లను రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్ వైపు వెళ్లే కొన్ని రైళ్లు వివిధ రైల్వే స్టేషన్లలో నిలిచిపోయాయి. సికింద్రాబాద్ వైపు వెళ్లే బస్సులను కూడా నిలిపివేసి దారి మళ్లించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments