Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకల దాకా తాగి పక్కింటి కాలింగ్ బెల్ కొట్టాడు.. పాపం ప్రాణం పోయింది...

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (12:50 IST)
పీకల దాకా మద్యం తాగిన మత్తులో పక్కింటి తలుపు కొట్టాడు. దీంతో సదరు వ్యక్తిని చితక బాదడంతో మృతి చెందిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం నందనవనంకు చెందిన మొగిలి గోపాల్‌ (45) బస్తీలో కూలీగా పని చేసేవాడు. ఆదివారం సెలవుదినం కావడంతో  మద్యం సేవించి తన సోదరి అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. 
 
సోదరి ప్లాట్‌ అనుకొని పక్కనే ఉన్న అంజలి అనే మహిళ ప్లాట్‌కు వెళ్లి కాలింగ్‌ బెల్‌ నొక్కాడు. అంజలి బయటికి రాగా తాను పొరబడినట్లు తెలుసుకున్న గోపాల్‌ దాహంగా వుందని మంచినీళ్లు కావాలని అడిగాడు. దీంతో ఎవరో తాగివచ్చి మంచినీళ్లు అడుగుతున్నాడు అని అరవడంతో ఆమె సోదరుడు ఆనంద్‌ గోపాల్‌పై దాడికి దిగాడు. 
 
గోపాల్‌ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆనంద్‌ వెనుక నుంచి బలంగా తన్నడంతో అతను మొదటి అంతస్తు మెట్లపై నుంచి కిందపడ్డాడు. దీనితో తీవ్రంగా గాయపడిన గోపాల్‌ను అతని సోదరి కవిత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments