Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితపై కన్నేశారు.. లోపలికి పిలిచి కోరిక తీర్చమన్నారు.. కాదనేసరికి?

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (12:48 IST)
వివాహితపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలనుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత అతని స్నేహితునికి కూడా ఆమెను పంచాలనుకున్నాడు. అయితే వివాహేతర సంబంధానికి ఆమె అంగీకరించకపోవడంతో.. ఆ మహిళను ఆ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ ప్రాంతంలో ఉండే సుశీల్(40) వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వివేక్ విహార్ ఏరియాలో ఖాళీగా ఉండే ఓ ఇంటికి కాపలా కాస్తున్నాడు. అదే ప్రాంతంలో 42 ఏళ్ల మహిళపై సుశీల్, అతని స్నేహితుడు మోజు పడ్డారు. ఈ నెల 6న ఇంటి ముందు నుంచి వెళుతున్న మహిళను లోపలికి పిలిచి.. తమ కోరిక తీర్చాల్సిందిగా బలవంతం చేశారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో.. ఆవేశంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. 
 
గొంతు నులిమి చంపేశారు. ఆపై ఆమె శవాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. మహిళ మృతదేహన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాచ్‌మెన్‌ను అరెస్ట్ చేశారు. అతని స్నేహితుడు మాత్రం పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments