Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ భయం నేరస్థుల్లో కలిగించాం.. తెలంగాణ వ్యాప్తంగా 6% తగ్గిన నేరాలు: డీజీపీ

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (21:17 IST)
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ మహేందర్‌ రెడ్డి విడుదల చేశారు. ఫంక్షనల్‌ వర్టికల్‌ సిస్టం అమలు ద్వారా పోలీసుల పనితీరు మెరుగుపరిచినట్లు ఆయన వివరించారు. ప్రజలకు మరింత సులువుగా అందుబాటులో ఉండేలా సామాజిక మాధ్యమాలు వాడుతున్నట్లు పేర్కొన్నారు.
 
‘నేరం చేస్తే దొరికిపోరతామనే భయం నేరస్థుల్లో కలిగించాం. స్మార్ట్‌ పోలీసింగ్‌ ద్వారా సేవలు మరింతగా అందుబాటులోకి తెచ్చాం. నేర రహిత, మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలోకి మావోయిస్టుల పునఃప్రవేశాన్ని పోలీసుల సమష్టి కృషితో అడ్డుకున్నాం. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పూర్తిగా విజయవంతమైంది. లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు అందించిన సేవలను జనం ప్రశంసించారు’ అని డీజీపీ పేర్కొన్నారు.
 
అన్ని రకాల నేరాలు తగ్గాయి..
‘గతేడాదితో పోలిస్తే దాదాపు అన్ని రకాల నేరాలు తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా నేరాలు 6 శాతం తగ్గాయి. హత్యలు 8.5 శాతం, మహిళలపై నేరాలు 1.9 శాతం, రహదారి ప్రమాదాలు 13.9 శాతం, వైట్‌కాలర్‌ నేరాలు 42 శాతం తగ్గాయి. 48.5 శాతం మంది నేరస్థులకు శిక్ష పడింది. ఈ ఏడాది ఎదురుకాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు సహా 135 మంది మావోయిస్టులు లొంగిపోయారు’ అని డీజీపీ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments