Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ భయం నేరస్థుల్లో కలిగించాం.. తెలంగాణ వ్యాప్తంగా 6% తగ్గిన నేరాలు: డీజీపీ

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (21:17 IST)
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ మహేందర్‌ రెడ్డి విడుదల చేశారు. ఫంక్షనల్‌ వర్టికల్‌ సిస్టం అమలు ద్వారా పోలీసుల పనితీరు మెరుగుపరిచినట్లు ఆయన వివరించారు. ప్రజలకు మరింత సులువుగా అందుబాటులో ఉండేలా సామాజిక మాధ్యమాలు వాడుతున్నట్లు పేర్కొన్నారు.
 
‘నేరం చేస్తే దొరికిపోరతామనే భయం నేరస్థుల్లో కలిగించాం. స్మార్ట్‌ పోలీసింగ్‌ ద్వారా సేవలు మరింతగా అందుబాటులోకి తెచ్చాం. నేర రహిత, మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలోకి మావోయిస్టుల పునఃప్రవేశాన్ని పోలీసుల సమష్టి కృషితో అడ్డుకున్నాం. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పూర్తిగా విజయవంతమైంది. లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు అందించిన సేవలను జనం ప్రశంసించారు’ అని డీజీపీ పేర్కొన్నారు.
 
అన్ని రకాల నేరాలు తగ్గాయి..
‘గతేడాదితో పోలిస్తే దాదాపు అన్ని రకాల నేరాలు తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా నేరాలు 6 శాతం తగ్గాయి. హత్యలు 8.5 శాతం, మహిళలపై నేరాలు 1.9 శాతం, రహదారి ప్రమాదాలు 13.9 శాతం, వైట్‌కాలర్‌ నేరాలు 42 శాతం తగ్గాయి. 48.5 శాతం మంది నేరస్థులకు శిక్ష పడింది. ఈ ఏడాది ఎదురుకాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు సహా 135 మంది మావోయిస్టులు లొంగిపోయారు’ అని డీజీపీ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments