Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్‌లైన్‌ కాల్‌మనీ వ్యవహారాలపై దృష్టిపెట్టండి : సీఎం ఆదేశం

అన్‌లైన్‌ కాల్‌మనీ వ్యవహారాలపై దృష్టిపెట్టండి : సీఎం ఆదేశం
, మంగళవారం, 22 డిశెంబరు 2020 (19:21 IST)
ఆన్‌లైన్‌ కాల్‌మనీ వ్యవహారాలపై దృష్టిపెట్టాలని సీఎం వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. సీఎంఓ కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు ఇచ్చారు. యాప్‌ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి, ఆ రుణాలు వసూలు చేయడానికి చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్నారన్న సమాచారం నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాల్‌మనీ వ్యవహారాలను ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 
 
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్యకు పాల్పడిన బాధిత కుటుంబాలకు సీఎం వైయస్‌.జగన్‌ ఆర్థికసాయం ప్రకటించారు. గుంటూరు జిల్లా కొర్రపాడులో ఆత్మహత్యచేసుకున్న పదోతరగతి బాలిక సౌమ్య కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని సీఎం ఆదేశించారు. లైంగిక వేధింపుల కారణాలతో తాను ఆత్మహత్యచేసుకున్నట్టుగా మృతురాలి వీడియో బయటకు వచ్చింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణం దశరాజుపల్లెలో జరిగిన సజీవదహన ఘటనలో మరణించిన దివ్యాంగురాలు, వలంటీర్‌ భువనేశ్వరి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ "‌‌రెండో ద‌శ" వస్తోంది.. తస్మాత్ జాగ్రత్త : సీఎం జగన్