Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి ప్యాకేజీ-1 పనుల్లో విషాదం ... క్రేన్ వైరు తెగిన ఐదుగురు కూలీల దుర్మణం

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (09:52 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. రంగారెడ్డి ప్యాకేజీ-1 ఇర్రిగేషన్ పనుల్లో ఈ ఘటన జరిగింది. కొందరు కూలీలు పంప్ హౌస్‌లోకి దిగుతున్న సమయంలో క్రేన్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఐదుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. మృతులంతా బీహార్ రాష్ట్ర కూలీలుగా గుర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం రేమనగడ్డ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రంగారెడ్డి ప్యాకేజీ-1 పనులు చేసేందుకు కూలీలు ఉపక్రమించారు. ఇందుకోసం కొందరు కూలీలు పంప్‌హౌస్‌లోకి దిగుతున్న సమయంలో క్రేన్ వైరు ఒక్కసారిగా తెగిపడిపోయింది. దీంతో కూలీలు కిందపడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో కూలీ తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరిలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments