Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడులో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

తమిళనాడులో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
, మంగళవారం, 26 జులై 2022 (18:14 IST)
తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థినిల వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. గత రెండు వారాల్లో ముగ్గురు విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వరుస ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. 
 
ఇటీవల కళ్లకుర్చి జిల్లా చిన్నసేలంలో శ్రీమతి అనే ప్లస్ టూ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా తిరువళ్ళూరు జిల్లాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది. 
 
ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తూ వచ్చిన 17 యేళ్ల సరళ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమచారం అందుకున్న మప్పేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసును సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
మరోవైపు, ఈ వరుస ఆత్మహత్య ఘటనలపై ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్ స్పందించారు. విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడాలనే ఆలోచనను విడనాడాలని ఆయన కోరారు. కష్టాలను విజయాలుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మంకీపాక్స్ ప్రమాదం ఘంటికలు - బెంగుళూరు, కేరళల్లో అలెర్ట్