Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ కడుపులో 3 కేజీల వెంట్రుకల గడ్డ

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (10:25 IST)
తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కడుపులో 3 కేజీల వెంట్రుల గడ్డను వైద్యులు గుర్తించి ఆపరేషన్ ద్వారా దాన్ని తొలగించారు. గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ వచ్చిన ఈ మహిళకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. వెంట్రుకలు ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆ మహిళకు శస్త్రచికిత్స చేసి 3 కిలోల వెంట్రుకల గడ్డను బయటకు తీశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం బూచన్‌పల్లికి చెందిన శ్రీలత(20) కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది. కుటుంబీకులు ఆమెను ఈనెల 17న సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్పించారు. 
 
డాక్టర్‌ కొత్తపల్లి కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ యాదగిరి పరీక్షలు చేసి శ్రీలత కడుపులో గడ్డ ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం శస్త్రచికిత్స చేసి వెంట్రుకలతో కూడిన మూడు కిలోల వెంట్రుకల గడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం శ్రీలత క్షేమంగా ఉంది. ఆమెకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. 
 
చిన్నప్పటి నుంచి మానసిక ఒత్తిడి, ఒంటరితనం తదితర కారణాలతో కొందరిలో వెంట్రుకలు తినడం అలవాటుగా మారుతుందని డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. శ్రీలత మట్టి, సున్నం సైతం తినడం వల్ల కడుపులో వెంట్రుకలు గడ్డగా మారాయని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments