Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేధింపులు తాళలేక.. భర్త కళ్లముందే భార్య పురుగుల మందు తాగింది

వేధింపులు తాళలేక.. భర్త కళ్లముందే భార్య పురుగుల మందు తాగింది
, శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:09 IST)
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక.. ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఎదురుగా ఉండగానే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం. ఎం. పహాడీలో శుక్రవారం చోటు చేసుకుంది.
 
ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. భర్త వేధింపు భరించలేక రాజేంద్ర నగర్‌‌కు చెందిన షభానా బేగమ్ అనే వివాహిత… పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. తను పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నానని… ఇక నుండి నీవు ప్రశాంతంగా ఉండు అంటూ భర్తతో చెప్పి తన ముందే పురుగుల మందు సేవించింది.
 
భార్య విషం సేవించిందనే విషయం తెలిసి కూడా భార్యను కాపాడాల్సింది పోయి.. మూర్ఖంగా ప్రవర్తించాడు దుర్మార్గుడు సాజీద్. తన ముందే గిల గిలా కొట్టుకుంటున్నా ఆసుపత్రికి తీసుకొని వెళ్లకుండా పైశాచిక ఆనందాన్ని పొందాడు. చివరకు ఆ అభాగ్యురాలు ప్రాణాలు విడిచింది. 
 
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షభానా మృతితో తన ఐదుగురు పిల్లలు అనాథలు అయ్యారు. కాగా.. రెండు రోజుల కిందటే… నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కొత్తగా 31 వేల కరోనా పాజిటివ్ కేసులు