Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం తీపి కబురు- నేటి నుంచే డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల పంపిణీ

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2023 (20:04 IST)
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఆగస్టు 15 నుంచే లక్ష డబుల్ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ వుంటుందని తెలిపారు. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. నియోజవర్గానికి 4 వేల చొప్పున లక్ష ఇళ్ల పంపిణీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 
 
గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం ప్రజలనుద్దేశించిన ప్రసంగించిన కేసీఆర్.. హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నేటినుంచే అర్హులైన పేదలకు అందజేస్తుందని చెప్పారు. 
 
ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించిందని తెలిపారు. నేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వారికోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల నుంచి అర్చన అయ్యర్ లుక్

ప్రయోగాత్మక చిత్రం రా రాజా వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్

రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. ఎంతో కష్టపడ్డాను : ఐశ్వర్య రాజేష్

హరిహర వీరమల్లు తాజాఅప్ డేట్ - రాయల్ లుక్ లో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments