Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఆర్టీసీ ఎండీ కీలక నిర్ణయం - టిక్కెట్లపై 20 శాతం రాయితీ

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (11:42 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ ఆర్టీసీ ఎండీ బాధ్యతలు చేపట్టిన సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన మార్క్‌తో విధులు నిర్వహిస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి నడిపించేందుకు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతోంది. దీన్ని అధిక సంఖ్యలో నగర వాసులు సందర్శించేలా ఆయన కీలక ప్రకటన చేశారు. విజ్ఞానాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో రూ.100 టిక్కెట్‌పై 20 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు. 
 
నగరంలో 24 గంటల టిక్కెట్‌పై ఈ నెల 27వ తేదీ వరకు తగ్గింపు పొందవచ్చని ఆర్టీసీ ఎండీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, నగరంలో 24 గంటల పాటు చెల్లుబాటు అయ్యేలా రూ.100 టీ24 టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందటూ ఆర్టీసీ వెల్లడించింది. ఈ ఆఫర్‌ను నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments