Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 24న సొంతూరు పొన్న‌వ‌రానికి సీజేఐ ఎన్వి రమణ

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (11:33 IST)
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలిసారిగా జ‌స్టిస్ నూతలపాటి వెంకట రమణ త‌న స్వ‌గ్రామం కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలోని పొన్నవరం రానున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక మొదటి సారి సొంత ఊరుకు ఆయ‌న ఈ నెల 24న వ‌స్తుండ‌టంతో స్థానికులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.  
 
 
పొన్న‌వ‌రంలో ఆయ‌న 25న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 24 నుంచి 26 తేదీ వరకు సీజేఐ ఏపీలో ఉంటారు. 26న ఏపీ రాజధానికి వ‌చ్చి, హైకోర్టు సందర్శనతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

 
 ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ నెల 26న జరగనున్న ఏపీ రాష్ట్ర స్థాయి న్యాయాధికారులు రెండో సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 
 
 
అదే రోజు ఏపీ హైకోర్టుకు వ‌చ్చి, హైకోర్టు న్యాయవాదుల సంఘం, బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక ఏపీ హైకోర్టుకు ర‌మ‌ణ రావడం ఇదే మొదటి సారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments