Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 24న సొంతూరు పొన్న‌వ‌రానికి సీజేఐ ఎన్వి రమణ

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (11:33 IST)
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలిసారిగా జ‌స్టిస్ నూతలపాటి వెంకట రమణ త‌న స్వ‌గ్రామం కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలోని పొన్నవరం రానున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక మొదటి సారి సొంత ఊరుకు ఆయ‌న ఈ నెల 24న వ‌స్తుండ‌టంతో స్థానికులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.  
 
 
పొన్న‌వ‌రంలో ఆయ‌న 25న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 24 నుంచి 26 తేదీ వరకు సీజేఐ ఏపీలో ఉంటారు. 26న ఏపీ రాజధానికి వ‌చ్చి, హైకోర్టు సందర్శనతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

 
 ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ నెల 26న జరగనున్న ఏపీ రాష్ట్ర స్థాయి న్యాయాధికారులు రెండో సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 
 
 
అదే రోజు ఏపీ హైకోర్టుకు వ‌చ్చి, హైకోర్టు న్యాయవాదుల సంఘం, బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక ఏపీ హైకోర్టుకు ర‌మ‌ణ రావడం ఇదే మొదటి సారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments