Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవిష్కరణకు సిద్ధమైన 125 అడుగులు రాజ్యాంగ నిర్మాత విగ్రహం

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (10:40 IST)
హైదరాబాద్ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు భారీ విగ్రహ ప్రతిష్టాపన జరుగనుంది. ఈ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో తెలంగాణ ప్రభుత్వం తయారు చేయించి ప్రతిష్టించనుంది. ఈ నెల 14వ తేదీన శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.
 
దేశంలో ఇప్పటివరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో అతిఎత్తైన విగ్రహం కానుంది. పార్లమెంట్ ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తు లోహ విగ్రహాన్ని తయారు చేశారు. అంబేద్కర్ 132వ జయంతి వేడుకల సందర్భంగా ఈ విగ్రహాన్ని సీఎం కేసీఆర్, కొందరు బౌద్ధ గురువుల ప్రార్థనల మధ్య ఆవిష్కరిస్తారు. 
 
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు  వచ్చేందుకు వీలుగా రవాణా సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించనుంది. ఇందుకోసం వచ్చే వారిలో దాదాపు 50 వేలమంది  కూర్చొనే విధంగా కుర్చీలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments