షేక్‌పేట పారామౌంట్‌లో విషాదం... విద్యుదాఘాతానికి ముగ్గురు యువకుల మృతి

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (10:14 IST)
హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట పారామౌంట్‌ కాలనీలో విషాదం జరిగింది. విద్యుదాఘాతానికి అన్నదమ్ములతో పాటు వారి స్నేహితుడు కూడా మృత్యువాతపడ్డారు. దీంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు... అనస్‌ (19) తమ ఇంట్లో ఉన్న మోటారు స్విచ్‌ ఆన్‌ చేసేందుకు యత్నించగా కరెంట్‌ షాక్ కొట్టింది.
 
దీన్ని గమనించిన రిజ్వాన్‌ (18) తన అన్నను కాపాడేందుకు యత్నించగా అతడికి కూడా షాక్ తగిలింది. అన్నదమ్ములను రక్షించేందుకు పక్కనే ఉన్న స్నేహితుడు రజాక్‌ (16) ప్రయత్నించగా ప్రమాదవశాత్తు అతడు కూడా షాక్‌కి గురయ్యాడు. దీంతో ఈ ముగ్గురూ ఘటనాస్థలంలోనే చనిపోయారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
 
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments