Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణ్యమొస్తదని ఇంత పులిహోర ప్రసాదం నోట్లో వేసుకున్నారు

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (21:46 IST)
పుణ్యమొస్తదని ఇంత పులిహోర ప్రసాదం నోట్లో వేసుకున్నారు ఆసుపత్రి పాలయ్యారు.  కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లింగంపల్లిలో గణేష్ నవరాత్రులు వైభవంగా ముగియడంతో గణనాధుడుని నిమజ్జనం రోజు యాత్ర నిర్వహించారు. నిమజ్జనం రోజున నిర్వాహకులు పులిహార ప్రసాదంగా పంపిణీ చేశారు. ఆ ప్రసాదం కోసం భక్తులు అందరూ క్యూ కట్టారు. 
 
ప్రసాదం తింటే పుణ్యం వస్తుందని ఆశపడి ప్రసాదం కోసం ఎగబడి తిన్నారు. అయితే ఆ పులిహోర తిని 100 మంది వరకూ ఆసుపత్రి పాలయ్యారు. అందులో 10 మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. కడుపునొప్పి, వాంతులు, జ్వరం రావడంతో ఆసుపత్రి వర్గాలు జ్వరాలు సీజన్ అని అనుకున్నారు. 
 
తీరా 100 మంది వరకూ ఆసుపత్రులకు చేరడంతో అసలు ఏజరిగిందని డాక్టర్లు క్లూ లాగితే అసలు విషయం బయటకు వచ్చింది. నిర్వహకులు పంచిన ప్రసాదం మూలంగానే ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు పెద్దరూ అందరూ ఆసుపత్రి పాలయ్యారు. అందుకే ప్రసాదం అని పంచగానే తినకుండా కాస్త జాగ్రత్తులు తీసుకోండని చెబుతున్నారు డాక్టర్లు. అసలే తెలంగాణ అంతటా జ్వరాలు ప్రబలడంతో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు డాక్టర్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments