Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగాలకు నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితి పెంపు

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (10:55 IST)
ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితిని పొడగిస్తూ జీవో జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరిట ఈ జీవో జారీ అయింది. 
 
ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి ప్రస్తుతం 34 సంవత్సరాలుగా ఉంది. దీన్ని 41 యేళ్లకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబరు 42ను జారీచేసింది. ఈ సడలింపు నిర్ణయం వచ్చే రెండేళ్ల పాటు అంటే 2024 మార్చి 18వ తేదీ వరకు ఉంటుంది. 
 
అయితే, ఈ మినహాయింపు పోలీస్, ఎక్సైజ్, జైళ్ళ, అటవీశాఖ వంటి యూనిఫాం సర్వీసులకు వర్తించదు. కాగా, 80039 ఉద్యోగ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీంతో వయోపరిమితి దాటిన వారికి కూడా లబ్ది చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments