ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.... ఏంటది?

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (10:39 IST)
వేసవి కాలంలో నెలకొనే రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఈ రద్దీని నివారించేందుకు వీలుగా 104 ప్రత్యేక రైళ్లను నుడుపనున్నట్టు ప్రకటించింది. ఈ రైళ్లు వివిధ ప్రాంతాలకు నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్టు ద.మ రైల్వే అధికారులు వెల్లడించారు. ఇదే అంశంపై శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
వీటిలో సికింద్రాబాద్‌ - ఎర్నాకులం ప్రత్యేక రైలు (నంబరు 07189) ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 24 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి  బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 8.15 గంటలకు ఎర్నాకులం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఎర్నాకులం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (నంబరు 07190) ఏప్రిల్‌ 2 నుంచి జూన్‌ 25 వరకు  ప్రతి శనివారం రాత్రి 11.25 గంటలకు ఎర్నాకులం నుంచి  బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. 
 
అలాగే, మచిలీపట్నం - కర్నూలు సిటీల మధ్య  ప్రత్యేక రైలు (07067) ఏప్రిల్‌లో 2, 5, 7, 9, 12, 14, 16, 19, 21, 23, 26, 28, 30 తేదీల్లో, మేలో 3, 5, 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, 31 తేదీల్లో, జూన్‌లో 2, 4, 7, 9, 11, 14, 16, 18, 21, 23,25, 28, 30 తేదీల్లో 15.50 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు 5.10 గంటలకు కర్నూలు చేరుతుందని వివరించారు. 
 
తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీ - మచిలీపట్నం ప్రత్యేక రైలు (07068) ఏప్రిల్‌లో 3, 6, 8, 10, 13, 15, 17, 20, 22, 24, 27, 29 తేదీల్లో, మేలో 1, 4, 6, 8, 11, 13,15, 18, 20,22, 25, 27, 29 తేదీల్లో, జూన్‌లో 1, 3, 5, 8, 10, 12, 15, 17, 19, 22, 24, 26, 29, జూలై 1వ తేదీన 20.00 గంటలకు కర్నూలులో బయలుదేరి మరుసటి రోజు 7.15 గంటలకు మచిలీపట్నం చేరుతుందని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments