Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. పెరిగిపోతున్నాయ్

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (09:38 IST)
కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో తగ్గినట్లే తగ్గి వ్యాపిస్తోంది. తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం శుక్రవారం 1,451 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,20,675 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో తొమ్మిది మంది మరణించారు. ఇప్పటివరకు 1265 మంది కరోనాతో మరణించారు.
 
ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 22,774గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,96,636 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,983 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
తెలంగాణాలో రికవరీ రేటు 89.1% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 87.7% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.57 %గా ఉన్నాయి. రాష్ట్రంలో శుక్రవారం 42,497 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 37,89,460 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 235 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments