Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hyderabad: పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఆత్మహత్య

సెల్వి
గురువారం, 19 జూన్ 2025 (13:53 IST)
పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాదం వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో సురేశ్ రెడ్డి (28) అనే యువకుడు ఓ కంపెనీలో సీఏగా పనిచేస్తున్నాడు. అతని సోదరుడితో కలిసి మణికొండలో ఉంటున్నాడు. 
 
అయితే జూన్ 16న సురేశ్‌ రెడ్డి తన సోదరి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొండాపూర్‌లోని రాజరాజేశ్వరీ కాలనీలో ఉన్న సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పని ఒత్తిడి తాళలేక సురేశ్ రెడ్డి హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
పని ఒత్తిడి తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని రాసి పెట్టిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇక మృతుడి స్వస్థలం కామారెడ్డి జిల్లా పాల్వంచగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments