Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసుకు వెళ్లి తిరిగిరాని యువతి... కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య

ఠాగూర్
గురువారం, 19 జూన్ 2025 (13:39 IST)
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని సుష్మ (27)గా గుర్తించింది. ఆఫీసుకు వెళ్లిన ఆ యువతి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆ యువతి కోసం గాలించగా దుర్గం చెరువులో శవమై కనిపించింది. 
 
నగరానికి చెందిన సుష్మ బుధవారం రోజున హైటెక్ సిటీలోని తన కార్యాలయానికి వెళ్ళినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, సాయంత్రం అయినా ఆమె ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకరు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యంకాలేదు
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి దుర్గం చెరువు కేబుల్ వంతెన సమీపంలో ఓ మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి ఆరా తీయగా, ఆ మృతదేహం సుష్మదిగా నిర్ధారించారు. 
 
సుష్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో సుష్మ కుటుంబ సభ్యు్ల్లో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments