Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆఫీసుకు వెళ్లి తిరిగిరాని యువతి... కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య

Advertiesment
suicide

ఠాగూర్

, గురువారం, 19 జూన్ 2025 (13:39 IST)
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని సుష్మ (27)గా గుర్తించింది. ఆఫీసుకు వెళ్లిన ఆ యువతి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆ యువతి కోసం గాలించగా దుర్గం చెరువులో శవమై కనిపించింది. 
 
నగరానికి చెందిన సుష్మ బుధవారం రోజున హైటెక్ సిటీలోని తన కార్యాలయానికి వెళ్ళినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, సాయంత్రం అయినా ఆమె ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకరు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యంకాలేదు
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి దుర్గం చెరువు కేబుల్ వంతెన సమీపంలో ఓ మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి ఆరా తీయగా, ఆ మృతదేహం సుష్మదిగా నిర్ధారించారు. 
 
సుష్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో సుష్మ కుటుంబ సభ్యు్ల్లో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇరాన్-ఇజ్రాయేల్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు- ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన పుతిన్