Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఉదయం ఉండను.. నా వస్తువులే ఉంటాయి.. మహిళ ఆత్మహత్య

సెల్వి
బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (19:11 IST)
హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్ధిక్ నగర్‌లో ఆరు అంతస్థుల హాస్టల్ భవనంపై నుంచి 22 ఏళ్ల మహిళ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది.. కానీ ఆమె తల్లిదండ్రులు బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే, మృతురాలిని కోల్‌కతాకు చెందిన రిసోజ్‌గా గుర్తించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టెర్లింగ్ పీజీ హాస్టల్‌లో నివసిస్తోంది. ఐటీ కంపెనీలో హెచ్‌ఆర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తోంది. ఈ సంఘటనకు ముందు, ఆమె ఫిబ్రవరి 3 అర్ధరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది.
 
"నేను ఉదయం అక్కడ ఉండను... నా వస్తువులు మాత్రమే మిగిలి ఉంటాయి" అని పేర్కొంది. ఆ సందేశంతో ఆందోళన చెందిన ఆమె స్నేహితురాలు ఆమెకు తల్లిదండ్రులకు సమాచారం అందించగా, వారు ఆమెకు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆమె స్పందించలేదు. 
 
కొద్దిసేపటికే, ఆమె హాస్టల్ భవనంలోని ఆరో అంతస్థు నుండి దూకింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments