Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చీరల వ్యాపారికి పడకసుఖం ఇస్తూ ఊపిరాడకుండా చేసి చంపేసిన మహిళ... ఎలా?

Advertiesment
murder

ఠాగూర్

, సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (22:16 IST)
తాను అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని ఓ మహిళ చంపేసింది. పడక సుఖం ఇస్తూనే ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే,
 
జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 32 యేళ్ల మహిళకు భర్తతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో తమ గ్రామంలోకి చీరలను విక్రయిస్తూ, చీరలపై డిజైన్లు వేసే ఓ వ్యాపారితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త కాలక్రమంలో అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ చీరల వ్యాపారి పేరు ఇక్బాల్. ఆరంభంలో ఇష్టంతోనే ఇక్బాల్‌తో శారీక సుఖం పొందుతూ వచ్చిన ఆ మహిళ... ఆ తర్వాత ఇక్బాల్‌ను దూరం పెట్టసాగింది. 
 
అయితే, అతను మాత్రం ఆ మహిళను వదిలిపెట్టలేదు. దీంతో ఈ సంబంధానికి ముగింపు పలకాలన్న గట్టి నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయాన్ని తొలుత ఇక్బాల్‌కు చెప్పిచూడగా ఆ వ్యాపారి ససేమిరా అన్నారు. పైగా, బ్లాక్‌మెయిలింగ్‌ చేయడం, శారీరకసుఖం పొందడం నిత్యం ఓ తంతుగా మారిపోయింది. దీంతో తాను అనుకున్న ప్లాన్‌ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఈ క్రమంలో తన భార్యను పుట్టింట్లో వదిలి వస్తూ తన ప్రియురాలికి ఫోన్ చేశాడు. తన భర్త ఉన్నాడని చెప్పినా ఇక్బాల్ ఒప్పుకోలేదు కదా... ఆమె భర్త నిద్రలోకి జారుకునేందుకు ఓ ఐడియా కూడా చెప్పాడు. టీలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వాలని చెప్పాడు. ఆమె ఇక్బాల్ చెప్పినట్టుగానే చేయడంతో భర్త నిద్రలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంటిలోకి వచ్చిన ఇక్బాల్ తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని, ఎలాగైనా మట్టుబెట్టాలని లేదా తానైనా చావాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఇక్బాల్ కోరిక తీర్చేలా శృంగారానికి అంగీకరించింది. ఆ తర్వాత అతడి చేతులు ముందుకు రాకుండా, అటూ ఇటూ కదలకుండా అతని ఛాతిపై కూర్చొంది. తన చేతులతో అతని ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చేసింది. దీంతో ఇక్బాల్ చనిపోయాడు. దీన్ని నిర్ధారించుకున్న ఆమె.. ఇక్బాల్ మృతదేహాన్ని ఇంటి మెట్లపైకి లాక్కొచ్చి వదిలేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా మిన్నకుండిపోయింది. 
 
ఇక్బాల్ మృతదేహం ఇంటి మెట్లపై ఉందని సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత విచారణ చేపట్టగా, అసలు నిందితురాలిని గుర్తించారు. ఆ తర్వాత ఇక్బాల్‌ను తాను ఎలా హత్య చేసిందో పూసగుచ్చినట్టు వివరించింది. దీంతో ఇక్బాల్ బ్లాక్ మెయిలింగ్‌తో విసిగిపోయానని, అందుకే అతన్ని హత్య చేసినట్టు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో ఆ మహిళను అరెస్టు చేసి జైలుకు పంపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!