Webdunia - Bharat's app for daily news and videos

Install App

Woman killed husband: భర్తను గోడకేసి కొట్టి ఆపై గొంతు నులిమి హత్య చేసిన భార్య

సెల్వి
బుధవారం, 28 మే 2025 (08:19 IST)
కట్టుకున్న భర్తను ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. భర్తను గోడకేసి కొట్టి.. ఆపై గొంతు నులిమి హత్య చేసిందో మహిళ. ఆపై ప్రమాదవశాత్తూ చనిపోయాడని పోలీసులతో సహా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం భావత్‌తండాకు చెందిన సభావత్‌ కిషన్‌ నాయక్‌(40), శిరీష దంపతులు వనస్థలిపురంలో నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శిరీషకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. 
 
ఈ సంబంధం పట్ల భార్యాభర్తల పట్ల జగడం వచ్చింది. సోమవారం సాయంత్రం మద్యం తాగిన కిషన్‌ నాయక్‌ తన భార్య పనిచేసే వద్దకు వెళ్లి ఇంటికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో మరోసారి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో శిరీష భర్త కిషన్ నాయక్‌గా గట్టిగా గోడకేసి కొట్టింది. 
 
అంతటితో ఆగకుండా ఆయన గొంతును గట్టిగా నులిమి హత్య చేసింది. ఆపై అంబులెన్స్‌లో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లింది. కిషన్‌ నాయక్‌కు పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments