Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలుకు నడుచుకుంటూ వెళ్లిన టెన్త్ విద్యార్థిని.. గుండెపోటు కుప్పకూలిపోయింది..

సెల్వి
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (09:51 IST)
Student
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని గురువారం ఉదయం పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్న 10వ తరగతి విద్యార్థి గుండెపోటుతో మరణించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. 
 
రామారెడ్డి మండలంలోని సింగరాయపల్లి గ్రామానికి చెందిన శ్రీ నిధి (16) ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవడానికి కామారెడ్డిలో నివసిస్తోంది. ఆమెకు పాఠశాల సమీపంలో ఛాతీ నొప్పి వచ్చి కుప్పకూలిపోయింది. స్కూలుకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే గుండెపోటు వచ్చిందని పోలీసులు తెలిపారు. 
 
వెంటనే ఒక పాఠశాల ఉపాధ్యాయుడు ఆమెను గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు CPR (కార్డియోపల్మనరీ రిససిటేషన్)తో సహా ప్రాథమిక చికిత్స అందించారు, కానీ ఆమె స్పందించకపోవడంతో ఆమెను వేరే ఆసుపత్రికి రిఫర్ చేశారు. రెండవ ఆసుపత్రిలో శ్రీ నిధి గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
 
పాఠశాల ఉపాధ్యాయులు,  విద్యార్థులు, మృతురాలి తల్లిదండ్రులు శ్రీనిధి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 16ఏళ్ల శ్రీ నిధి లాంటి చిన్న వయస్సులో గుండెపోటుతో మరణించడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments