Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణాకు ప్రాధాన్యం ఇచ్చారు : బండి సంజయ్ - కిషన్ రెడ్డి

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (09:54 IST)
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌‍లు అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోగా, తెలంగాణ అనే పదాన్ని కూడా విత్తమంత్రి నిర్మల పలకలేదని అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న విషయం తెల్సిందే. వీరి విమర్శలను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు తిప్పికొట్టారు. 
 
మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ... తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వలేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ మూర్ఖంగా మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సహా పలు రాష్ట్రాలలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో గొప్ప బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. 2047 నాటికి భారత్‌ను అంతర్జాతీయంగా నెంబర్ 1గా చూడాలనేది మోడీ కోరిక అన్నారు. ఆ విజనరీని సాకారం చేసే దిశగా బడ్జెట్ ఉందన్నారు. మౌలిక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని నిపుణుల కమిటీ తేల్చిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్ల పాటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.
 
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పింది కాంగ్రెస్, వంతపాడింది కేసీఆర్... వీరే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదాను విభజన చట్టంలో ఎందుకు పొందుపర్చలేదో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. డీపీఆర్‌ను ఉద్దేశపూర్వకంగా సమర్పించని బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.
 
అలాగే, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఆఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వారికి పన్ను ఆదాను ప్రకటించిందన్నారు. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments