Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు ఎకరాల భూ వివాదం.. ఆరుగురిని గొడ్డలితో నరికేసిన మాజీ సైనికుడు..

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (09:34 IST)
రెండు ఎకరాల భూ వివాదం ఆరుగురు కుటుంబ సభ్యుల హత్యకు దారితీసింది. ఓ మాజీ సైనికుడు ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులను గొడ్డలితో నరికివేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ మాజీ సైనికుడు రెండెకరాల భూవివాదంలో తన కుటుంబంలోని ఆరుగురి సభ్యులను కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో నిందితుడి తల్లి సరూపి దేవి (65), అన్న హరీశ్ కుమార్ (35), వదిన సోనియా (32), ముగ్గురు చిన్నారులు.. పరి (7), యషిక (5) మయాంక్ (6నెలలు) ఉన్నారు. వారంతా నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో ఈ దారుణానికి భూషణ్ కుమార్ పాల్పడ్డాడు. 
 
అన్న, వదినను నరికిన తర్వాత వారి ముగ్గురు పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. అనంతరం మృతదేహాలను తగలబెట్టే ప్రయత్నం చేశాడు. తండ్రి ఓం ప్రకాశ్ అడ్డుకోవడంతో ఆయనపైనా దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి అంబాలా జిల్లా రతోర్ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

తర్వాతి కథనం
Show comments