Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై దాడి.. ఖండించిన ఎండీ సజ్జనార్

సెల్వి
బుధవారం, 10 జనవరి 2024 (17:54 IST)
TSRTC
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేస్తే సహించేది లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై బైకర్‌ దాడి చేసిన ఘటనపై సజ్జనార్‌ స్పందించారు. 
 
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణారహితంగా దాడులు చేయడం సమంజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. అయినా వారంతా ఎంతో ఓర్పుతో, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.
 
సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంతో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురిచేయవద్దని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments