Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నిరుద్యోగులకు శుభవార్త : గ్రూపు-1 పరీక్షల తేదీల వెల్లడి

వరుణ్
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (07:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గ్రూపు-1 పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ పరీక్షల షెడ్యూల్‌‍లో భాగంగా, జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ దరఖాస్తులను మార్చి 14 తేదీ వరకు కొనసాగుతుంది. 
 
రాష్ట్రంలో 563 గ్రూపు-1 పోస్టుల ప్రిలిమినరీ పరీక్షలను జూన్ 9వ తేదీన నిర్వహించనున్నట్టు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. పేపర్ లీకేజీతో పాటు ఇతర కారణాల వల్ల గత ప్రభుత్వం 2022లో ఇచ్చిన గ్రూపు-1 నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెల్సిందే. నాటి నోటిఫికేషన్‌లో పోస్టులకు అదనంగా మరికొన్ని పోస్టులను జోడించి తాజాగా మరో గ్రూపు-1 నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుతం వీటి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ మార్చి 14వ తేదీతో ముగియనుంది. 
 
కాగా, భూగర్భజల శాఖలో వివిధ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష జనరల్ బ్యాంకు జాబితాను కూడా టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. ఈ లిస్టును వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments