Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : ఎనిమిది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

వరుణ్
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (06:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై ఆయన అనర్హత వేటు వేశారు. 
 
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని ఇటు అధికార, అటు విపక్ష పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీరిలో వైకాపాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఉన్నారు. టీడీపీ తరపున కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్‌లను అనర్హులుగా ప్రకటించాలని ఆయా పార్టీలు కోరాయి. 
 
వీటిపై ఇటీవలే విచారణ చేపట్టిన తమ్మినేని సీతారాం... న్యాయనిపుణుల సలహా కూడా తీసుకున్నారు. ఆ తర్వాత సోమవారం రాత్రి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, టీడీపీకి చెందిన గంటా శ్రీనివాస రావు రాజీనామా వ్యవహారం న్యాయస్థానం పరిధిలో పెండింగ్‌లో ఉండటంతో ఆయన రాజీనామా ఆమోదంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments