Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీజీ అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష : సీఎం రేవంత్

వరుణ్
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (13:07 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లపై "టీజీ" అనే అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. 
 
'ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే "జయ జయహే తెలంగాణ"ను అధికారిక గీతంగా, సగటు రాష్ట్ర ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా, రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా, వాహన రిజిస్ట్రేషన్లలో టీఎస్ బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. దాన్ని నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం" అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

హెచ్. వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి చిత్రం ప్రకటన - 2025 అక్టోబ‌ర్ లో రిలీజ్

హీరో విజయ్ 69వ చిత్రంపై అధికారిక ప్రకటన

సిద్దు జొన్నలగడ్డ, నీరజ కోన కాంబోలో తెలుసు కదా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

దానిమ్మ పువ్వు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments