Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కకాటుతో ఐదు నెలల బాలుడు మృతి.. ఇంట్లో వదిలి కూలీకి వెళ్తే...

సెల్వి
మంగళవారం, 14 మే 2024 (17:21 IST)
వికారాబాద్ జిల్లా తాండూరులో మంగళవారం కుక్కకాటుతో ఐదు నెలల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌కు చెందిన దత్తు, లావణ్య దంపతులు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ తమ బిడ్డ సాయితో కలిసి నివసిస్తున్నారు. 
 
రోజూలాగే మంగళవారం కూడా దంపతులు తమ ఐదు నెలల కుమారుడిని ఇంట్లో వదిలి కూలి పనులకు వెళ్లారు. పనిలో మధ్య లావణ్య నీళ్లు తాగేందుకు ఇంటికి తిరిగి రాగా ఇంటి దగ్గర ఓ కుక్క సంచరించడం గమనించింది. ఆమె ఇంటి లోపలికి వెళ్లి చూడగా కుమారుడిపై కుక్క దాడి చేసి కనిపించింది. వెంటనే కుటుంబీకులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
కుక్క ఫ్యాక్టరీ యజమానులదని, వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అయితే, ఫ్యాక్టరీ యజమానులు తమ వద్ద పెంపుడు కుక్క లేదని, వీధి కుక్క పిల్లవాడిపై దాడి చేసి వుండవచ్చునని చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments