Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కకాటుతో ఐదు నెలల బాలుడు మృతి.. ఇంట్లో వదిలి కూలీకి వెళ్తే...

సెల్వి
మంగళవారం, 14 మే 2024 (17:21 IST)
వికారాబాద్ జిల్లా తాండూరులో మంగళవారం కుక్కకాటుతో ఐదు నెలల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌కు చెందిన దత్తు, లావణ్య దంపతులు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ తమ బిడ్డ సాయితో కలిసి నివసిస్తున్నారు. 
 
రోజూలాగే మంగళవారం కూడా దంపతులు తమ ఐదు నెలల కుమారుడిని ఇంట్లో వదిలి కూలి పనులకు వెళ్లారు. పనిలో మధ్య లావణ్య నీళ్లు తాగేందుకు ఇంటికి తిరిగి రాగా ఇంటి దగ్గర ఓ కుక్క సంచరించడం గమనించింది. ఆమె ఇంటి లోపలికి వెళ్లి చూడగా కుమారుడిపై కుక్క దాడి చేసి కనిపించింది. వెంటనే కుటుంబీకులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
కుక్క ఫ్యాక్టరీ యజమానులదని, వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అయితే, ఫ్యాక్టరీ యజమానులు తమ వద్ద పెంపుడు కుక్క లేదని, వీధి కుక్క పిల్లవాడిపై దాడి చేసి వుండవచ్చునని చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments