Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ : మాజీ మంత్రి షబ్బీర్ అలీ

వరుణ్
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (11:56 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ గేట్లు ఎత్తివేస్తే భారత రాష్ట్ర సమితి ఖాళీ అవుతుందని, ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, అందువల్ల గాంధీ భవన్ ద్వారాలు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ అవుతుందని ఆయన చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో... పడిపోతుందో అంటూ మాజీ మంత్రి కేటీఆర్ అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మేం కనుక ద్వారాలు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమన్నారు. కానీ పార్టీలో చేరికల విషయమై తమ అధిష్టానం ఇప్పుడు వద్దని చెబుతోందన్నారు. పార్టీ ఫిరాయింపులు వద్దనడం వల్ల ఆగామని లేదంటే ఇతర పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.
 
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ అని జోస్యం చెప్పారు. పదేళ్లలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదని... అప్పుడే బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారన్నారు. తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఖాళీ కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments