Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఖాళీ అవుతున్న బ్యాంకు ఖాతాలు.. ఎందుకో తెలుసా?

వరుణ్
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (11:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. దీనికి కారణం ఏపీ ప్రభుత్వం చేపట్టిన కులగణన కోసం సేకరిస్తున్న వేలిముద్రలని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. కులగణన పేరుతో ప్రతి ఒక్కరి వేలి ముద్రలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. కులగణన కోసం వేలిముద్రలు తీసుకున్న కొన్ని గంటల్లోనే అనేక మంది బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు డెబిట్ అవుతున్నాయి. దీంతో పలువురు బాధితులు బ్యాంకులకు వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితి ముఖ్యంగా కోనసీమ జిల్లా రావులపాలెంలో ఈ ఘటన జరిగింది. 
 
స్థానికల కథనం మేరకు... గత నెల 31వ తేదీన పొడగట్లపల్లిలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేసుకుని వేలిముద్రలు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోని వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కట్ అయినట్టు మొబైల్ ఫోన్లకు సందేశాలు వచ్చాయి. దీంతో వారు బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు.
 
అలాగే, రావులపాలెంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూక్రయ విక్రయాలు చేసేవారు కూడా ఈకేవైసీకి వేలిముద్రలు సేకరించారు. ఇలా వీటిని తీసుకున్న కొద్దిసేపటికే వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అయినట్టు మెసేజ్‍లు వచ్చాయి. వెదిరేశ్వరంలో 10 మందికి, రావులపాలెంలో 15 మందికి ఇలాంటి సందేశాలు వచ్చాయి. దీంతో వీరంతా బ్యాంకులకు పరుగులు తీసి... సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో హనీమూన్ ఎక్స్ ప్రెస్ : చిత్ర యూనిట్

కోలీవుడ్‌లో విషాదం : 'మహారాజ' నటుడు ప్రదీప్ కన్నుమూత

చంద్రబాబు గారిని కలిసి కుప్పం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశానని ని చెప్పా : హీరో సుధీర్ బాబు

సెప్టెంబ‌ర్ 27న ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ దేవర గ్రాండ్ రిలీజ్

మమ్ముట్టితో సమంత యాడ్ ఫిల్మ్

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

ఉడికించిన కూరగాయలు ఎందుకు తినాలో తెలిపే 8 ప్రధాన కారణాలు

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments