Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి అనకొండ.. ఏపీబీ తనిఖీల్లో రూ.2.93 కోట్ల నగదు స్వాధీనం (Video)

ఠాగూర్
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (18:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ మున్సిపల్‌ సూపరింటెండెంట్‌ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్‌ సూపరింటెండెంట్‌ (ఇన్‌చార్జ్ రెవెన్యూ ఆఫీసర్)గా దాసరి నరేందర్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఈయనపై నమోదైన కేసులో భాగంగా ఆయన నివాసంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు వెలుగు చూశాయి. 
 
ఇంట్లో రూ.2.93 కోట్ల నగదును, రూ.1.10 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్‌ను నరేందర్, అతని భార్య, అతని తల్లి ఖాతాల్లో ఉన్నాయి. అదనంగా 51 తులాల బంగారం, 17 స్థిరాస్తుల విలువ రూ.1.98 కోట్లు అతని ఇంట్లో గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.6.07 కోట్లుగా గుర్తించారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments