Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త రేషన్ కార్డు జారీకి మంత్రల ఉప సంఘం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

UttamKumar

ఠాగూర్

, శుక్రవారం, 9 ఆగస్టు 2024 (10:38 IST)
కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రుల ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సభ్యులుగా మంత్రులు దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఉంటారని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అర్హులు ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సబ్కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. 
 
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ కమిటీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డు లబ్దిదారుల ఎంపికపై అధ్యయనం చేసి విధివిధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ప్రస్తుతం రేషన్ కార్డు లబ్దిదారులకే ఉచిత ఆరోగ్య వైద్య సేవలు (హెల్త్ కార్డు) అందుబాటులో ఉన్నాయి. అయితే ఉచిత వైద్య సేవల కోసం అనర్హులు కూడా రేషన్ కార్డులు పొందుతున్నారని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే రేషన్ కార్డు, హెల్త్ కార్డు లింక్ను తొలగించి వేర్వేరుగా కార్డులు మంజూరు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూణెలో పెరిగిపోతున్న జికా వైరస్ కేసులో... ఒకే రోజు 8 నమోదు