Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చుతామనడం సరికాదు, భారాసకి ఇక గడ్డు కాలమే: రాజయ్య

ఐవీఆర్
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (11:43 IST)
భారాసకి వీరవిధేయుడిగా వుండే టి. రాజయ్య ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ పార్టీకి భవిష్యత్ అంతా గడ్డుకాలం ఎదురుకాబోతోందని జోస్యం చెప్పారు. తనకు టిక్కెట్ ఇవ్వకుండా తమ సామాజిక వర్గంపై కేసీఆర్ పెద్ద దెబ్బ వేసారని ఆయన అన్నారు. ప్రజాబలంతో ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కొందరు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సహేతుకమైనవి కావన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఆ పార్టీ మరింత దిగజారిపోతుందని, ప్రజల్లో విలువ లేకుండా పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
తనకు టిక్కెట్ ఇవ్వలేదనీ, ఐనా తమతో మాట్లాడుతారని ఆరు నెలలుగా ఎదురుచూసాననీ, ఇక ఓపిక లేక భారాసకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాజీనామా చేసిన తర్వాత ఏం చేయాలన్నదానిపై తమ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా రాజయ్య ఫిబ్రవరి 10వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments